కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సమయాన్ని కాస్త ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందెల ఉత్తర్వులలో పేర్కొన్నట్లూ తెలుస్తుంది. నేడు ఉదయం జరిగిన క్యాంపు కార్యాలయంలో సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆంక్షలు తెలియజేసినట్లు తెలుస్తోంది.