కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. రష్మిక మందన, అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ ర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కుబేర.. త్వరలోనే రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కుబేర.. లాంగ్ రన్ లో చాలా బలమైన కలెక్షన్ లోనే కొల్లగొట్టేలా కనిపిస్తుంది. ఇక అసలు మేటర్ ఏంటంటే.. సినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. వారం రోజుల క్రితం వరకు కూడా సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులు పూర్తికాలేదు.
ఈ క్రమంలోనే సినిమా వాయిదా వేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన అమెజాన్ దానిని తిరస్కరించింది. చెప్పిన డేట్కు రిలీజ్ చేయకపోతే కుదుర్చుకున్న డీల్లో రూ.10 కోట్ల కోత విధిస్తామంటూ బెదిరించిన సంగతి నిర్మాత సునీల్ నారంగ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.45 కోట్లకు కొనుగోలు చేసిందట. అమెజాన్ ప్రైమ్ తెలుగుతో పాటు.. ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అమెజాన్లో సినిమా అందుబాటులోకి రానుంది. వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమా రిలీజ్ అయిన 4 వారాలకే అమెజాన్ ప్రైమ్లో సినిమా రిలీజ్ చేయాలని టీం ఫిక్స్ అయ్యారట. వచ్చే నెల 23 నుంచి 25 లోపు సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.
సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయానికి సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుందన్నమాట. అయితే త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వెలువడనుంది. ఒకవేళ.. థియేట్రికల్ రన్ అద్భుతంగా ఉంటే మాత్రం మరో రెండు వారాలు సినిమా వాయిదా వేసే ఛాన్స్ ఉంది. కానీ.. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో సినిమా నాలుగు వారాల్లో ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ టాక్ బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే మూడు గంటల నడివి ఉన్న సినిమాను థియేటర్లకు వెళ్లి ఏం చూస్తాంలే.. నాలుగు వారాలు ఓపిక పడితే చక్కగా ఇంట్లోనే ఓటీటీలో గ్రాండ్గా సినిమాను చూడొచ్చు అని ఆడియన్స్ వెనక్కు తగ్గే అవకాశం ఉంది. ఇది థియెట్రికల్ అని తగ్గిపోవడానికి కారణం కూడా అవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. కనీసం 8 వారాల గ్యాప్ తర్వాత అయినా సినిమాలు రిలీజ్ చేసేలా డీల్ మేకర్స్ కుదుర్చుకుంటే బాగుండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.