పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్.. నిర్మాతలకు గుడ్ న్యూస్..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌, పాపులారిటీ, వ్య‌క్తిత్వం గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఇక ప్ర‌స్తుతం ఏపి డిప్యూటి సిఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా.. ఫ్యాన్స్‌ను, నిర్మాతలను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తాను కమిట్ అయిన సినిమాలను సైతం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాను పూర్తి చేసేందుకు సహాయసక్తుల ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తిచేసిన మూవీ టీం.. కొత్త రిలీజ్ డేట్ ను సైతం అనౌన్స్ చేసారు. జూన్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Veera | Streaming on Prime

అలాగే మరో సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో టీం ఉన్నారట. దీని తర్వాత మరో రెండు సినిమాలు పవన్ నటించాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయం కచ్చితంగా టాలీవుడ్ నిర్మాతలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ సెన్సేషనల్ డెసిషన్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుత పవన్ కళ్యాణ్ గతంలో సైన్ చేసిన సినిమాల షూట్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే సినిమాలో షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. నిర్మాతలపై ఆర్థిక భారం పడుతుంది. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి అప్పులకు.. వడ్డీలు పెరిగి వాళ్ళు సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది.

Exclusive Update: Makers Revealed 'Ustad Bhagat Singh' Release Date -  Bigtvlive English

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. నిర్మాతలను పిలిచి మరి తను నటించే సినిమాలకు నాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ వద్దని చెప్పేసారట. నా వల్ల సినిమా రిలీజ్ కు ఆలస్యమైంది. అందుకే నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించాడట. వీరమల్లు కోసం రూ.20 కోట్ల రెమ్యున‌రేషన్ తీసుకోవాల్సి ఉండగా.. కొంత భాగం అడ్వాన్స్ తీసుకున్న పవన్.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా కోసం రెండేళ్ల క్రితమే ర‌రూ.15 కోట్ల అడ్వాన్స్గా అందుకున్నారు. ఈ అడ్వాన్సులు తప్పించి.. ఒక రూపాయి కూడా తీసుకోనని.. ఈ రెండు సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తాను.. కానీ డబ్బు మాత్రం వద్దంటూ వివరించాడట. ప్రస్తుతం పవన్ తీసుకున్న ఈ సెన్సేషనల్ డెసిషన్ నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తుంది.