టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ అందుకుంటు దూసుకుపోతున్న మహేష్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై.. కే.ఎల్.నారాయణా దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది చివరకు లేదా.. ఆ పై బచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుక్కుమారన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆఫ్రికన్ అడవిలో నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై హాలీవుడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. గతంలో మహేష్ బాబు హీరోగా నటించి.. ఇండస్ట్రియల్ హిట్లుగా నిలిచిన మూడు సినిమాలను మొదట రవితేజ రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ సినిమాలో ఏంటో.. అసలు ఆ సినిమాలో దర్శకులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ ది పోకిరి. మహేష్ బాబు హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించింది తెలిసిందే. మొదట ఈ సినిమా కోసం.. పూరి రవితేజను అనుకున్నడట. అయితే రవితేజ దానిని రిజెక్ట్ చేయడంతో కథలో చిన్న చిన్న మార్పులు చేసి మహేష్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు మలిచి ఈ సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన దూకుడు సినిమాను సైతం రవితేజతో రూపొందించాలని భావించాడట.
అయితే.. ఈ కథ నచ్చినా అప్పటికే మరో ప్రాజెక్టుతో బిజీగా ఉన్న రవితేజ.. ఈ సినిమాను రిజెక్ట్ చేశాడని.. దీంతో శ్రీను వైట్ల.. మహేష్కు స్టోరీ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక కొరటాల శివ డైరెక్షన్లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన శ్రీమంతుడు కథను మొదట రవితేజకు వినిపించాడట కొరటాల. భద్ర సినిమాకు రచయితగా వ్యవహరించిన ఆయన.. ఆ సమయంలోనే ఈ కథ లైన్ను వినిపించగా.. చేద్దాంలే అన్నారట. అయితే మిర్చి సినిమాతో దర్శకుడుగా మారిన కొరటాల.. తర్వాత శ్రీమంతుడు సినిమాను మహేష్తో రూపొందించాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ఇలా రవితేజ వదిలేయడంతో మహేష్ ఖాతాలో మూడు ఇండస్ట్రియల్ హిట్లు పడ్డాయి.