ఎన్టీఆర్ బర్త డే స్పెషల్: ప్రశాంత్ నీల్ తో సినిమా పై బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్..!

నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈరోజు నీ ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు నందమూరి అభిమానులు . ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు. తన బర్త్డ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఆయన వర్క్ చేస్తున్న సినిమాల నుంచి స్పెషల్ స్పెషల్ అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ వచ్చింది . అఫ్ కోర్స్ ఈ పాట కొంతమందిని ఆకట్టుకుంది మరి కొంత మందిని ఆకట్టుకోలేకపోయింది .

తాజాగా కొద్దిసేపటి క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు . ఈ సినిమా ఆగస్టు 2024 లో సెట్స్ పైకి రాబోతుంది అంటూ మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది ఓ పవర్ హౌస్ ప్రాజెక్ట్ అంటూ కూడా హై ఇచ్చేశారు . ఈ సినిమాను మైత్రి మూవీ వారు నిర్మిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు . అంతేకాదు నిజానికి ఈరోజు ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను రివిల్ చేయాలనుకున్నారట మేకర్స్.

డ్రాగన్ అంటూ పవర్ ఫుల్ టైటిల్ కూడా పెట్టారట . కొన్ని కారణాల చేత లాస్ట్ మినిట్లో ఆ అప్డేట్ ను పోస్ట్ పోన్ చేస్తూ సినిమా షూట్ కి సంబంధించిన డీటెయిల్స్ ను రివిల్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ ఈ అప్డేట్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసేస్ అంటూ ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన ఈ అప్డేట్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ లో కొత్త ఊపులు తెప్పిస్తుంది . ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కే జి ఎఫ్ – సలార్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలిసిందే . అంతకుమించిన రేంజ్ లో ఈ సినిమా హిట్ కాబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!