పేద ప్రజలకు ఓ గూడు కల్పంచాలనే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా మొదటి విడతలో సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్ళ నిర్మాణం చేసి… పేద ప్రజలకు అందించారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాదిలో లక్ష ఇళ్ళ నిర్మాంచాలని … ప్రభుత్వం భావించింది.ఒక్కో ఇంటిపై ఏడున్నర లక్షలు ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అంటే ఒక్కో […]
Tag: Telangana
జలజగడం-రాజకీయ ప్రయోజనాలే అజెండా!
ఎడ్డెం అంటే తెడ్డెం.. అన్న చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం. నీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నీటి కేటాయింపులపై కేంద్రం వద్ద పంచాయితీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. షరామామూలుగానే చర్చలు ఓ కొలిక్కి రాలేదు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టిందిగానీ, ఏకాభిప్రాయాన్నయితే తీసుకురాలేకపోతోంది. ‘ముందు మీరు మాట్లాడుకోండి.. మీకు సయోధ్య కుదరకపోతే ఆ తర్వాత ఆలోచిస్తాం..’ […]
జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]
త్వరలో రెడ్డిగారి రాజకీయ సన్యాసం?
తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ […]
టార్గెట్ కేసీఆర్: కోదండరామ్ వదల్లేదు
కేసీఆర్ని టార్గెట్ చేయడం ఇప్పట్లో మానేలా లేరు తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. విదేశాలకు వెళ్ళి వచ్చిన కోదండరామ్ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్పై విమర్శలకే వాడుకోవడం ద్వారా ‘టార్గెట్ కేసీఆర్’ మిషన్ని యాక్టివ్గానే ఉన్నట్లు సంకేతాలు పంపారాయన. తెలంగాణ ఉద్యమంలో కెసియార్తో కలిసి పనిచేసిన కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కెసియార్ ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే తనను దాటేసి వెళ్ళిపోతున్నారని […]
ఈ వ్యభిచారమేటి రెడ్డిగారూ?
పార్టీ ఫిరాయింపుని రాజకీయ వ్యభిచారం అని సంబోదిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే అదిప్పుడు రాజకీయాల్లో సాధారణ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిపాలన పక్కన పెట్టి మరీ పాలకులు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో జరిగినప్పటికీ రాజకీయ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత జుగుప్సాకరంగా ఇంతకు ముందెన్నడూ పార్టీ ఫిరాయింపులు జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించినవారిలో గుత్తా సుఖేందర్రెడ్డి ఒకరు. ఆయన కూడా […]
హైకోర్టులో గెలిచిన కెసిఆర్
ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. 2008 ఉప ఎన్నికల సందర్భంగా ఆయనపై వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఉప ఎన్నికల్లో కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల సమావేశాల సందర్భంగా చంద్రశేఖరరావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు […]
KTR లోని సత్తా చూడాలనుకుంటున్న కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకి హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాక, హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కెసియార్, ఆ బాధ్యతని కెటియార్ భుజాల మీద పెట్టారు. ఐటి రంగంలో హైదరాబాద్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళేలా కసరత్తులు చేస్తున్న కెటియార్, హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం కెటియార్ చేస్తున్న చర్యలు అభినందనీయమే. అయితే హైదరాబాద్లో రోడ్లు నరకానికి […]
చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]