ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ ప్యాకెట్ పాలన ఉపయోగిస్తున్నారు. అయితే ప్యాకెట్ పాలను ఫాశ్చరైజర్ మిల్క్ అని అంటారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాసేపు వేడి చేసి చల్లార్చిన తర్వాత ప్యాకెట్లలో ఈ పాలను ప్యాక్ చేసే ప్రాసెస్ ని ఫార్చునైజేడ్ ప్రాసెస్ అంటారు.అయితే ఫాశ్చరైజర్ మిల్క్ కంటే పచ్చిపాలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని కొందరు భావిస్తారు. పచ్చిపాలల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయని వారు పచ్చిపాలు తాగడానికి శ్రద్ధ చూపుతూ ఉంటారు. అయితే ఇది నిజమని ఎటువంటి ఆధారాలు లేవంటూ శాస్త్రవేత్తలు తెల్చి చెప్పారు. ఇంకా పచ్చిపాలన తాగడం వల్ల ఆరోగ్యానికి బదులు అపాయం కొనితెచ్చుకున్నట్లు అంటూ వివరించారు.
పచ్చిపాలను డైరెక్ట్ గా తీసుకోవడం చాలా డేంజర్ అంటూ చెప్పుకొచ్చారు. పాశ్చరైజేషన్ చేయని పాలనే పచ్చిపాలు అంటారని.. ఇందులో రకరకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయని.. ఫాశ్చరైజేషన్ చేయకపోవడంతో త్వరగా శరీరంలోకి వ్యాపిస్తాయంటూ వివరించారు. పాలు త్వరగా పాడవడానికి కూడా కారణం అదేనంటూ చెప్పుకొచ్చారు. పచ్చిపాలనను తాగడం వల్ల ప్రధానంగా బోవైన్ ట్యుబారికలోసిస్ వ్యాధి తలెత్తుతుందని చెబుతున్నారు. 1900 కాలంలో పాశ్చరైజేషన్ ప్రక్రియను కనిపెట్టకముందు 25 ఏళ్ల సమయంలో ఏకంగా 65వేల మంది వ్యాధితో మరణించారు. అయితే పచ్చిపాలను తాగడం ద్వారానే వారికి అవ్యాధి వ్యాపిస్తోందని నిపుణులు చెప్తున్నారు.
ఫాశ్చరైజర్ పాలలో అందరూ అనుకున్నట్లు పోషకాలు ఏమీ తక్కువగా ఉండవని మనుషులు ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయంటూ వివరించారు. పచ్చిపాల లో బోవెన్ ట్యుబారికాలోసిస్ తో పాటు ఇంకా ఎన్నో రకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయట. ఈ పాలలో ఉండే మరిని బ్యాక్టీరియాల కారణంగా ఆర్ధసైటిస్చ కెలియన్ బార్సిండ్రుచ హిమాలటిక్ యూరామిక్ సిండ్రోమ్ లాంటి సమస్యలు తలెత్తుతాయని డయేరియా, డిహైడ్రేషన్, వాంతులు, జ్వరం లాంటి సమస్యలు వస్తాయంటూ వివరించారు. అదే పాశ్చరైజేషన్ పాలల్లో అధిక శాతం హానికరం బ్యాక్టీరియాలను నశించి మనకు కావలసిన పోషకాలు అందిస్తాయని.. కనుక పచ్చిపాల జోలికి పోవద్దంటే నిపుణులు చెబుతున్నారు.