ఆగస్టు 8న జిఎస్‌టి బిల్లుపై లోక్‌సభలో చర్చ

లోక్‌సభలో సోమవారం జిఎస్‌టి బిల్లుపై చర్చ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రధాని ప్రమేయంతో వివిధ రాష్ట్రాల్లోని శాసన సభల్లో కూడా దినికి ఆమోదం లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు ఆమోదం ఆరోజే ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే ఆరోజు జిఎస్‌టి బిల్లుపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే! […]

ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]

టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]

గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ అనూహ్యంగా ఎంపికయ్యారు. చివరి క్షణం వరకు నితిన్ భాయ్ పటేల్ అవుతారని ప్రచారం జరిగినా…పార్టీ కేంద్ర పరిశీలక బృదం రూపానీనే ఎంపిక చేసింది. బీజేపీ శాసన సభ్యులతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేశ్ పాండేలతో కూడిన పరిశీలక బృందం చర్చించింది. మెజార్టీ సభ్యులు రూపానీ నాయకత్వం వైపే మొగ్గుచూపారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ ఎంపిక చేస్తారనే ప్రచారం ఇవాళ్టితో ముగిసిపోయింది. జైన్ అయిన విజయ్ ఒకప్పుడు […]

ఓ స్త్రీ రేపు రా!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్‌. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా […]

మోడీ కి తెరాస సత్తా చూపే టైమొచ్చింది

తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేసిన గులాబి నేతలు… ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణలో తమకు సాటి లేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న మొదటిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోదీ పాల్గోనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి […]

తోడు దొంగల బ్రేకప్ ఆట!

రాష్ట్ర విభజన తరువాత మొదట్లో టీడీపీ బీజేపీ ల మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో సాగింది..ఇప్పటికీ సాగుతూనే ఉందనుకోండి అది వేరే విషయం.అయితే మొదటి నుండి ఇద్దరిమధ్య గిల్లికజ్జాలు షరా మాములే అన్నట్టుగా సాగింది సంసారం.ఇద్దరు చాలా వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు అవసరానికి తగ్గట్టు ఆచి తూచి విమర్శించుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. ఎప్పటికప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లకు తోచిన విదంగా ఎదుటి వాళ్ళని వాడుకుంటూ వచ్చారు.ఈ విషయం లో బీజేపీ కంటే […]

ప్రెజర్‌ పీక్స్ వెంకయ్యకే!

ప్రత్యేక హోదా విషయంలో ఎక్కువ ప్రెజర్‌ ఫీలవుతున్నది వెంకయ్యనాయుడే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ని ఈయనే తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ద్వారా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించింది వెంకయ్యనాయుడే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అప్పటి ప్రధానితో ఆ ప్రకటన చేయించగలిగారుగానీ, ఇప్పుడు కేంద్ర మంత్రంగా ఉండి కూడా నరేంద్రమోడీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోతున్నారు. […]

ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?

ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]