తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.హైదరాబాద్ ఫిలింనగర్లో దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కాంట్రవర్సీకి సంబంధించిన కేసులో తాజాగా.. దగ్గుపాటి వెంకటేష్, రానా, అభిరామ్, నిర్మాత సురేష్ బాబు లకు నాంపల్లి కోర్ట్ కీలక నోటీసులు అందించింది. ఇక నేడు ఈ కేసు విచారణ జరిపిన కోర్ట్.. నవంబర్ 14న తదుపరి విచారణ ఉండనున్నట్లు వెల్లడించింది.
కచ్చితంగా వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబులు హాజరు కావాలంటూ క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత పూచికత్తు సమర్పించాల్సి ఉందని.. ఈ నలుగురు మళ్ళీ కోర్టుకు వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాల్సిందేనని తీర్పునిచ్చింది. కోర్ట్ ఆదేశాలను ధిక్కరించి మరీ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్ చేశారని ఆరోపణలు నేపథ్యంలో వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ లపై గతంలో కేసు నమోదయింది.
తాజాగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా.. కచ్చితంగా వీళ్ళ నలుగురు కోర్టుకు రావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసు నేపద్యంలో దగ్గుబాటి ఫ్యామిలి ఎంకెన్ని సార్లు కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుందో.. ఈ కాంట్రవర్సీ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.