నితిన్ హీరోగా.. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మరికొద్దిలో రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల నితిన్ చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉండబోతుందని నమ్మకం ఆడియన్స్లో కలిగింది. ఈ సినిమాతో నితిన్ ఎలాగైనా హిట్ కొడతాడని అభిమానుల్లో నమ్మకం చిగురించింది. ప్రస్తుతం నితిన్ వరుస ప్లాపుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. ఈ సినిమా నితిన్కు కొత్త ఊపిరి పోస్తుంది అంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఈ సినిమాతో కచ్చితంగా నితిన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏకంగా రూ.75 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ రూపంలో రూ.38 కోట్ల వరకు దక్కించుకుందట. ఇక.. జులై 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే.. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు.. ఏ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సమాచారం. ఇక నీతిన్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు.. దిల్ రాజు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆసక్తి చూపుతారు. పైగా.. తమ్ముడులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో క్లియర్ క్లారిటీ ఇచ్చేశారు.
ఇలాంటి క్రమంలో సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇస్తే.. మల్టీప్లెక్స్లో కలెక్షన్స్ కి భారీ దెబ్బ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే.. సెన్సార్ ఏ సర్టిఫికెట్ కు కారణం సినిమాల్లో యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉండటమేనట. నైట్ బ్యాక్డ్రాప్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్లో కాస్త హారర్ టచ్ కూడా ఉందని.. ఈ క్రమంలోనే ఏ రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలను కట్ చేస్తే యూ ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు క్లారిటీ ఇచ్చారట. కానీ.. సినిమా మూడు డిస్టర్బ్ అవకూడదనే ఉద్దేశంతో మేకర్స్, దిల్ రాజు కలిసి ఏ సర్టిఫికెట్ కు అంగీకరించినట్లు టాక్ నడుస్తుంది. సినిమా అయితే కచ్చితంగా ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు వివరించినట్లు సమాచారం.