టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీ అంచనాలు నడుమ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దండయాత్ర సృష్టించిన దేవర.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత.. దేవర పార్ట్ 2 పై కూడా ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. దేవర 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే సందేహాలు అభిమానులు అందరిలోనూ నెలకొన్నాయి.
ఇక దేవర పార్ట్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇస్తే బాగుండని అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ ప్రస్తుతం నటిస్తున్న వార్ 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత దేవర 2 సెట్స్లోకి అడుగు పెడతానంటూ తార క్లారిటీ ఇచ్చాడు. కచ్చితంగా దేవర పార్ట్ 2 ఉంటుందని.. అందులో సందేహం లేదంటూ వెల్లడించాడు. కొరటాలు కూడా ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పనుల్లో పూర్తిగా బిజీ అయినట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం దేవర పార్ట్ 2కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి నుంచి సినిమా సెట్స్ పైకి రానుందట. దేవర 2 కథ కోసం కొరటాల ఓ రేంజ్ లో కసరత్తులు చేస్తున్నాడని.. ఇప్పటికే కొరటాల శివ టీం దేవర 2 ను మరింత బలంగా మార్చేందుకు పనులు మొదలుపెట్టేసారని తెలుస్తుంది. ఇక జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. రెండో భాగంలో మరింత పవర్ఫుల్గా విలన్ రోల్ ను చూపించనున్నారని సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అవడంతో.. రెండో పార్ట్ కు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడని తెలుస్తుంది. ఇక దేవర సీక్వల్ పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.