టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఫేవరెట్ మూవీ ఏంటంటే.. ఖుషి అని చెప్తారు. ఈ జనరేషన్ ఆడియన్స్ లోను ఖుషి ఫేవరెట్ సినిమా అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక ఈ సినిమా తాజాగా రీ రిలీజై ఎలాంటి సంచలనం సృష్టించిందో.. ఫ్యాన్స్ ఏ రేంజ్లో పోటెత్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఖుషి సీక్వెల్ గా ఖుషి 2 వస్తే బాగుంటుందని.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయలో బిజీగా గడుపుతున్న క్రమంలో కుదరదు కనుక.. ఆయన తనయుడు అకీరా నందన్తో సినిమా తీస్తే బాగుంటుందని అభిమానులు ఇప్పటికే ఆశాభావాలను వ్యక్తం చేశారు.
దీనిపై తాజాగా ఖుషి డైరెక్టర్, నటుడు ఎస్.జే సూర్య రియాక్ట్ అయ్యారు. అకీరాని రాజమండ్రిలో చూశానని.. అతను చాలా బాగున్నారు. తన తండ్రిలానే పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. హీరో అయితే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ ఎస్. జె. సూర్య వివరించాడు. ఖుషి 2 చేయాలని నాకు ఉంది. చూడాలి.. ఎలా రాసిపెట్టిందో అంటూ వివరించాడు. అకీరా ఎంట్రీ గురించి తాజాగా రేణు దేశాయ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన ఎంట్రీ గురించి అందరికంటే ఎక్కువగా నేనే ఎదురుచూస్తున్నానంటూ.. కానీ అదంతా అకీరా నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందంటూ వెల్లడించింది.
అకీరాకు నటనపై ఇంట్రెస్ట్ ఉందా.. లేదా.. అనేది పెద్ద సందేహం. ఎందుకంటే రేణు దేశాయ్ గతంలో తనకు సంగీతం అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్.. మ్యూజిక్ కూడా అందుకే నేర్చుకున్నాడు అంటూ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అకీరా కెమెరా ముందుకు రావాలంటే మరింత సమయం పట్టొచ్చు. అంతేకాదు.. ఎస్. జె. సూర్య కూడా ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనే ఉంచారు. ఇక నటుడుగా కంఫర్ట్ జోన్లో ఉన్న నేపథ్యంలో.. మరోసారి సూర్య డైరెక్షన్ వైపు చూస్తాడా.. లేదా.. అనేది కూడా డౌటే. మంచి కథ దొరికితే తప్ప ఖుషి 2 సంగతి ఆలోచించినని చెప్పకనే చెప్పేశాడు సూర్య. ఇక అకీరా నటనపై ఆసక్తితో ఖుషి 2 చేద్దామని అడిగితే మాత్రం సూర్య నో చెప్పే అవకాశం లేదు. ఈ క్రమంలోనే అకీరా వీలైనంత త్వరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటూ పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.