టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్లో ఏ రేంజ్లో హైప్ ఉంటుందో తెలిసిందే. అలాంటిది.. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో.. సందీప్ మూవీ అంటే ఆడియన్స్లో అంచనాలు డబల్ అయిపోతాయి. కాగా.. గతంలోనే మహేష్, సందీప్ కాంబో మిస్ అయిందంటూ టాక్ తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సందీప్ సైతం.. మహేష్కు కథ చెప్పానని.. కానీ కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు అంటూ వివరించాడు. అయితే అదే అనిమల్ మూవీ అని మహేష్ నో చెప్పడంతో రణ్బీర్తో చేశాడంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానిపై కూడా సందీప్ క్లారిటీ ఇస్తూ నేను మహేష్ తో చేయాలనుకున్న మూవీ అనిమల్ కాదు.. డెవిల్ అంటూ వివరించాడు.
అయితే అప్పట్లో మిస్ అయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సెట్ అయిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం మహేష్.. రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే మహేష్.. ఎస్ఎస్ఎంబి 29 కంప్లీట్ అయినా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక తాజాగా.. మహేష్ బాబు, రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడని.. స్టార్ ప్రొడ్యూసర్ ఏషియన్ సునీల్ అఫీషియల్గా వెల్లడించాడు.
ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ తర్వాత మహేష్ రేంజ్ పాన్ వరల్డ్ కు వెళ్తుంది. అలాంటి ఇమేజ్ ఉన్న హీరోని హ్యాండిల్ చేయగల సత్తా కేవలం సందీప్కి మాత్రమే ఉందని అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. సందీప్ ప్రస్తుతం.. ప్రభాస్ పిరియడిక్ మూవీ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒక ప్రభాస్ దిరాజాసాబ్, ఫౌజి సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి.. స్పిరిట్ కంప్లీట్ చేయడానికి ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలోనే స్పిరిట్ కంప్లీట్ చేసిన తర్వాత సందీప్, మహేష్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని సమాచారం.