సినీ ఇండస్ట్రీలో ఏడుపదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 సినిమాతో పాటు.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూలి సినిమాలోను రజనీకాంత్ నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై కోలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఉన్న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం రెండు సినిమాల షూట్లు సరవేగంగా పూర్తి చేస్తున్నాడు రజనీకాంత్. రెండు సినిమాల్లోకి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న కూలి సినిమాపై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
విజయ్, కార్తీ, కమలహాసన్ కు తిరుగులేని సక్సెస్ కలెక్షన్లు వర్షం కురిపించిన లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో ఏకంగా సూపర్ స్టార్ హీరోగా నటిస్తుండడంతో.. ఈ కాంబోపై ఆడియన్స్లో మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కథానిధి మారన్.. దాదాపు రూ.370 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సహార సత్యనారస్, శృతిహాసన్ కీలకపాత్రలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరవనున్నారు. ఇక ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ.. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్కు ముందే రికార్డు లెవెల్లో బిజినెస్లు జరుగుతున్న నేపథ్యంలో.. నాన్ థియేట్రికల్ రైట్స్కు సైతం కళ్ళు చెదిరే బిజినెస్ జరిగిందట.
కూలీ డిజిటల్ రైట్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక కేవలం సాటిలైట్ రైట్స్కు రూ.90 కోట్లు, ఆడియో రైట్స్కు రూ.20 కోట్లు అమ్ముడైనట్లు టాక్ వైరల్ గా మారుతుంది. కేవలం నాన్ ధియేటర్ రైట్స్తోనే మొత్తంగా రూ.240 కోట్లు కూలి సినిమాకు బిజినెస్ జరిగిందట. ఇక దియేట్రికల్ రైట్స్ ఏ రేంజ్ లో అమ్ముడు పోతాయో అనే ఆశక్తి రజనీకాంత్ అభిమానుల్లోనూ మొదలైంది. కాగా.. ఇటీవల సినిమాకు సంబంధించిన 100 రోజుల కౌంట్డౌన్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించారు. ఈ క్రమంలోనే కూలి కోసం రజనీకాంత్ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రజినీ రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. గతంలోనే బాలీవుడ్ స్టార్స్ ను మించి పోయే రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుని సంచలనం సృష్టించిన రజిని ఇప్పుడు ఏడుపదుల వయసులోనూ అదే రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. కూలి సినిమాకు తన రెమ్యునరేషన్ ఒక్కసారిగా భారీగా పెంచేసిన రజినీ.. ఏకంగా ఈ సినిమా కోసం రూ.150 కోట్ల రెమ్యూనరేషన్లు ఛార్జ్ చేస్తున్నాడట. ఇందులో వాస్తవం ఏంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. దట్ ఇస్ ధలైవా అంటూ.. అది రజిని క్రేజ్ అంటూ.. కూలితో రజిని మాస్టర్ ర్యాంపేజ్ షురూ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.