టాలీవుడ్ స్టార్ బ్యూటీ సిమ్రాన్.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలిసుందాం.. రా.. సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినా బాలయ్య, చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన్న ఈ అమ్మడు.. బాలయ్యతో నువ్వు వస్తావని, నరసింహనాయుడు సినిమాలో నటించి మెప్పించింది. ఇక చిరుతో మృగరాజు, డాడీ సినిమాలో నటించింది. ఇక చిరంజీవితో కలిసి నటించిన అన్నయ్య సినిమాలో.. అటకావాలా.. పాట కావాలా సాంగ్తో చిందులేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు కంటే తమిళలో ఎక్కువ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇక తాజాగా చిరంజీవి, బాలకృష్ణ గురించి అమ్మడు చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి. సిమ్రాన్ తాజాగా జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీకి సంబంధించిన ఈవెంట్ లో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తెలుగులో మళ్లీ నటించాలని ఉందంటూ చెప్పిన ఆమె.. మంచి రోల్స్ వస్తే సినిమా తప్పకుండా నటిస్తానని వివరించింది. అలాగే కొన్ని పాటల గురించి టాపిక్ రాగా.. వాటిపై రియాక్ట్ అయిన సిమ్రాన్.. చిరు హీరోగా నటించిన అన్నయ్య సినిమాలో ఆట కావాలా.. పాట కావాలా.. సాంగ్ నాకు ఎప్పటికీ ఫేవరెట్ అంటూ వివరించింది. అయితే బాలయ్య ఫ్యాన్స్ను మాత్రం ఈ అమ్మడు డిసప్పాయింట్ చేయలేదు.
బాలయ్యతో కలిసి నటించిన నరసింహనాయుడు సినిమాలో అన్ని సాంగ్స్ కూడా తనకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సిమ్రాన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇలా చిరంజీవి, బాలయ్య ఇద్దరు సినిమాల్లో నటించడం తనకు చాలా ఇష్టమని.. వారి సినిమాల్లో సాంగ్స్ కూడా తన ఫేవరెట్ అంటూ వివరించి.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ను వివాహం చేసుకున్న సిమ్రాన్.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చి మరోసారి తన సత్తా చాటుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట 1997లో తమిళ్ విఐపి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 60కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.