యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించారు.
ఈ ఫిక్షనల్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా దేశ విదేశాల నుంచి ప్రశంసలు దక్కించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని మరింత పెంచింది. తాజాగా `త్రిబుల్ ఆర్` సినిమా జపాన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సినిమా టీం జపాన్ కు చేరుకున్నారు. జపాన్ ప్రేక్షకుల కోరిక మేరకు అక్కడ అక్టోబర్ 21న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
అయితే `త్రిబుల్ ఆర్` టీం జపాన్ క్యాపిటల్ టోక్యోలో పాపులర్ లగ్జరియస్ హోటల్ లో బస చేస్తున్నారు. అక్కడ హౌస్ కీపింగ్ టీం అందరూ తారక్ కి పెద్ద అభిమానులట. ఇక తారక్ ని అక్కడ చూడగానే ఫోటోల కోసం తారక్ ఆటోగ్రాఫ్ కోసం సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించారు. అందులో ఒక అభిమాని తారక్ మీద ఉన్న ప్రేమతో రాసిన లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఆయనకు చూపించింది. జపాన్ లో లేడీ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ సర్ప్రైజ్ గ్రీటింగ్స్ చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హౌస్ కీపింగ్ టీం తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు యంగ్ టైగర్ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#NTRJrTakesOverJapan
Here's a glimpse of @tarak9999 global fandom as he gets a heartfelt message from the hotel staff in Japan who happen to be his fans#RRR #fans #NTRJr pic.twitter.com/n0n5HdhQMZ— Ramesh Bala (@rameshlaus) October 19, 2022