నవంబరులో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తానంటున్న సమంత..కొంప తీసి అదేనా..!?

నాగచైతన్య తో విడాకుల అనంతరం సినీ ఇండస్ట్రీలో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. చేతినిండా సినిమాలతో మరింత బిజీ స్టార్ గా మారిపోయింది. చైతుతో విడాకుల అయినప్పటికీ సమంత కెరీర్ పరంగా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల సామ్ బాలీవుడ్ లో ఓటిటి ప్రాజెక్టును చేస్తుంది.

తాజాగా ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సమంత మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఓటీటీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం. సమంత నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. రాజ్ మరియు డీకే దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించిన ఉన్న విషయం తెలిసిందే.

ఇది అంతర్జాతీయ హిట్ సిరీస్ `సిటాడెల్` యొక్క తెలుగు వర్షన్ అని సమాచారం. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ తర్వాత రాజ్ మరియు డీకే కాంబినేషన్లో రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఫ్యాన్స్ కు మరింత ఆసక్తి నెలకొంటుంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సమంత లిడ్ రోల్ లో నటించిన `శకుంతలం` సినిమా కూడా నవంబర్లో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ కారణంగా సమంత నవంబర్లో ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు వార్తలు జోరుగా ప్ర‌చారం జరుగుతున్నాయి.