మ‌ళ్లీ రీమేకే ముద్దంటోన్న చిరు…. ఈ సారి ఏ సినిమా అంటే…!

చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెలుగులో తీశాడు. సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవడంతో. చిరంజీవి మరో రీమేక్ చేయబోతున్నాడని టాక్‌ వినిపిస్తుంది.

చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన భీష్మ పర్వం సినిమాను రీమిక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్టు టాక్ వచ్చింది. మలయాళంలో మమ్ముటి హీరోగా వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. భీష్మ పర్వం కథ నచ్చడంతో చిరంజీవి ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట.. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాను నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగులో ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇంకా విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.