టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్యకు ముందు వరకు కొరటాల రాజమౌళి, త్రివిక్రమ్తో పోటీపడేంత గొప్ప డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆచార్య రిలీజ్ అయ్యాక కొరటాల గత నాలుగు సినిమాలతో సంపాదించుకున్న పేరంతా పోయింది. ఆచార్య సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే కొరటాల ఎన్నో కష్టాలు పడ్డారు. హీరోయిన్ ఎంపిక దగ్గర నుంచి.. కథలో మార్పులు.. చిరు జోక్యాలు… చివరకు నిర్మాత నిరంజన్ రెడ్డి సైతం ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొరటాలే ఆయన వాటా డబ్బులు ఇచ్చేసి తానే ఈ సినిమా మొత్తం తీసుకున్నారన్నది కూడా బయటకు వచ్చింది.
చివరకు ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలోనూ కొరటాలే అంతా చూసుకున్నారని అన్నారు. తీరా సినిమా డిజాస్టర్ కావడంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కొరటాలే అమౌంట్ ఇచ్చారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే చిరంజీవి మాత్రం సినిమా డిజాస్టర్కు కొరటాలే బాధ్యుడు అన్నట్టుగా పదే పదే చెపుతూ వచ్చారు. రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలోనూ చిరంజీవి కొరటాలపై మరోసారి తన అసహనం వ్యక్తం చేశారు.
మామూలుగా అయితే కొరటాలను ఎవరైనా ఏదైనా అంటే కొరటాల సమీప బంధువు పొసాని కృష్ణమురళీ లాంటి వాళ్లు వాళ్లపై తీవ్రంగా విరుచుకు పడిపోతారు. అయితే ఇప్పుడు చిరంజీవి కొరటాలను ఇన్నేసి సార్లు ఇన్ని మాటలు అంటున్నా ఒక్కరు నోరు మెదపడం లేదు. చిరంజీవి విమర్శలతో కొరటాల ఇమేజ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఇప్పట్లో మెగా కాంపౌండ్లో కొరటాల సినిమా చేయకూడదనే అనుకుంటున్నాడట. బన్నీతో సినిమా వేరు.. మెగా ఫ్యామిలీలో చిరు, చెర్రీతో ఇప్పట్లో ఖచ్చితంగా కొరటాల సినిమా ఉండదనే అంటున్నారు.
కొరటాల కూడా ఇప్పటి వరకు ఓపిక పట్టినా చిరు పదే పదే టార్గెట్ చేస్తుండడంతో ఖచ్చితంగా చిరుకు బుద్ధి చెప్పాలని బలంగా నిర్ణయించుకున్నారని కొరటాల సన్నిహితుల టాక్ ? ఆచార్య తర్వాత చిరు జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలని కొరటాల కసితో ఉన్నాడు. అందుకే త్రిబుల్ ఆర్ వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ఇప్పటకీ కొరటాల ఎన్టీఆర్ సినిమాను మరింత పగడ్బందీగా తెరకెక్కించాలని కథపై మరింతగా కసరత్తులు చేస్తున్నాడు.
ఎన్టీఆర్ తర్వాత బాలయ్యతో మరో సినిమాను కొరటాల తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. సితార బ్యానర్లోనే కొరటాల – బాలయ్య క్రేజీ కాంబో సెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొరటాల కూడా బాలయ్యతో సినిమా తీసి బ్లాక్బస్టర్ కొట్టి తానేంటో చిరుకు ఫ్రూవ్ చేయాలన్న కసితోనే ఉన్నాడని అంటున్నారు. అందుకే బాలయ్య ప్రాజెక్టును పంతంతో కావాలనే సెట్ చేయిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్ ?