వయసు పైబడుతున్నా కుర్రాళ్లతో సై అంటున్న సురేఖావాణి… డార్లింగ్స్‌ అంటూ కవ్విస్తోంది?

తెలుగులో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమె తన అభిమానులకు చేరువగానే ఉంటోంది. కాగా ఆమె వయసులో 50కి దగ్గరపడుతున్నా, ఆమె తన కూతురితోనే పోటీ పడుతోంది. తనని, తన కూతురిని చూసినవారు వారిని తల్లి కూతుళ్లు అని అనుకోరు.. అక్క, చెల్లెల్లు అని అనుకుంటారు. అంతలాగ సురేఖ తన అందచందాలను కాపాడుకుంటోంది.

అందానికి తోడు తనదైన నటనతో ఆమె ఆడియన్స్ లో బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. తెలుగులో ఆమె తల్లి, వదిన, అక్క, భార్య వంటి పాత్రల్లో నటించి, మెప్పించింది. సినిమాల విషయంలో ఆమె కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ తాజాగా ‘స్వాతిముత్యం’ చిత్రంలో మరలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 17 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన సురేఖ, నేటికీ అదే జోష్‌లో కనిపించి ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా సక్సెస్ మీట్ వేదికపై చిత్ర విజయం పట్ల తన సంతోషాన్ని తెలియజేసింది సురేఖ.

ఈ క్రమంలో తన అభిమానులను దృష్టిలో ఉంచుకొని ‘డార్లింగ్స్‌’ అని సంబోధిస్తూ… మాట్లాడింది. డార్లింగ్స్ అందరికీ హాయ్! అంటూ స్పీచ్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఇపుడు వస్తున్న కుర్ర హీరోలకు అమ్మగా, వదినగా, అక్కగా నటించడానికి సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈమధ్య కాలంలో క్యారెక్టర్స్ రావడం లేదని బాధ పడింది. ఈ క్రమంలో సురేఖా వాణి సినిమాలు మానేసిందని కొంతమంది పుకార్లు పుట్టించారని ఆరోపించింది. “నేను సినిమా అమ్మాయిని, సినిమా కోసమే ఉన్నాను, సినిమాలు చేస్తూనే ఉంటాను” అంటూ వేదికపై సురేఖావాణి చెప్పుకొచ్చింది.