ఇంకా ఎంత‌కాలం దాస్తావు.. అనుష్క‌పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఒకరైన అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. పాపులర్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2017 లో పెళ్లి చేసుకున్న అనుష్క ఇప్పుడు ఒక బిడ్డకి తల్లయింది. అనుష్క పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తూ తనకు తగ్గ పాత్రలో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా విరాట్ అనుష్క లు ఇద్దరు వారి కూతురు వామికాతో ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు అనుష్క- విరాట్ వారి కూతుర్ని మీడియాకు చూపించకుండా చాలా జాగ్రత్తగా పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వామికా పుట్టి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటివరకు తన కూతురు ఫోటోలు బయటకు రానివ్వకుండా సీక్రెట్ గా ఉంచుతున్నారు.

ఒక్కసారిగా వీరు ఎయిర్ పోర్ట్ లో క‌నపడగా మీడియా మిత్రులు వారి కెమెరాకు పని చెప్పారు. మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తుండటంతో అనుష్క వారి వంక ఎంతో కోపంగా చూసింది. ఏం చేస్తున్నారు? ఫోటోలు తీయడం ఆపండి.. అన్నట్లు మీడియాపై అసహనం చూపించింది. వాళ్లు వామికా ఫోటోలు తీయడం లేదు అని అనటంతో కాస్త చల్లబడి తదనంతరం భర్త విరాట్ తో కలిసి కెమెరాకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నీటిజెన్లు వీరిరువురుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం దాస్తారు.. మీడియా కంట పడకుండా వామికను అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొంతమంది అనుష్క చాలా ఆటిట్యూడ్ చూపిస్తుంది.. అంటూ ఆమె పై మండిప‌డుతు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనాప్పటికీ మీడియాపై అలా ప్రవర్తించిన అనుష్క వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CjSvcYdjjjy/?utm_source=ig_web_copy_link