ఈట‌ల స్థానంలో వ‌రంగ‌ల్ నేత‌కు మంత్రి ప‌ద‌వి..!

భూక‌బ్జా వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈట‌ల రాజేంద‌ర్ వ‌ద్ద నుంచి వైద్య ఆరోగ్య‌శాఖల‌ను త‌ప్పించారు. వాటిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నారు. రాజేంద‌ర్‌ను కేవ‌లం శాఖ‌లు లేని మంత్రిగానే కొన‌సాగిస్తున్నారు. రేపో మాపో పార్టీ నుంచి సైతం బ‌హిష్క‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, రాజ‌కీయ అడుగుల గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపిన ఈట‌ల షామిర్‌పేట‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అక్క‌డే త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు […]

అక్క‌డ జోరు.. మ‌రోచోట క‌నుమ‌రుగు

కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌. మొత్తం 140 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తున్న‌ది. ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడుతున్న‌ది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్క‌డ పూర్తిగా క‌నుమ‌ర‌గ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది. వెస్ట్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండ‌గా అందులో 292స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అందులో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]

ఓట‌మి దిశ‌గా మ‌రో ముఖ్య‌మంత్రి..!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానున్న‌దో అనే అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మ‌ళ్లీ అధికార పార్టీల హ‌వానే క‌నిపిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్‌పై క‌న్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమ‌డ దూరంలో నిలిచిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాషాయ పార్టీ […]

అక్క‌డ బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు..!

బీజేపీ అస్సాంలో విజ‌యం దిశ‌గా ప‌రుగులు తీస్తున్న‌ది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్య‌త‌ను చాటుకుంటున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాల‌కు ఎగ‌బాకింది. అక్క‌డి అధికార టీఎంసీ పార్టీకి స‌వాల్‌గా నిలిచింది. ఇంత‌గా యావ‌త్ భార‌తదేశ వ్యాప్తంగా స‌త్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చ‌తికిల‌ప‌డిపోయింది. డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితికి దిగ‌జారి పోయింది. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ మూడుస్థానంలో కొన‌సాగుతుండ‌గా అక్క‌డ కేవ‌లం 15వేల ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది. […]

మే 5 నుంచి లాక్‌డౌన్‌..ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా వైగంలో జోరు త‌గ్గ‌డం లేదు. దీంతో చేసేదేమి లేక ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్ర‌భుత్వం కూడా […]

బెంగాల్‌లో ఓవైసీ పార్టీకి ఝ‌ల‌క్‌..!

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించ‌లేక‌పోతున్న‌ది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను 292 స్థానాల‌కు ఎనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా […]

సాగ‌ర్‌లో విజ‌యం దిశ‌గా టీఆర్ ఎస్‌..!

న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం ఖాయ‌మైన‌ట్లుగా తెలుస్తున్న‌ది. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. ఎనిమిదో […]

ఓట‌మి దిశ‌గా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతున్నాయి. మ‌హ‌మ‌హులు ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఇప్ప‌టికే టీఎంసీ పార్టీ ప్ర‌భుత్వాన్ని చేప‌ట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. మొత్తంగా 161 స్థానాల్లో ముందంజ‌లో ఉన్న‌ది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్కించిన ఓట్ల‌లో మొత్తంగా టీఎంసీ 51శాతం సాధించ‌గా, 35శాతం ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మూడు […]

అగ్ర‌న‌టులు ముంద‌జ‌.. ఖుష్బూ వెనుకంజ‌

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయ‌గా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని కూటమి […]