మేయ‌ర్ నియామ‌కానికి టీఆర్ ఎస్ ప‌రిశీల‌కులు వీరే..!

ఇటీవ‌ల జ‌రిగిన రెండు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఐదు మున్సిపాల్టీల్లో టీఆర్ ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు పార్టీ త‌ర‌పున పరీశీలకుల పేర్ల‌ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల […]

ఏపీ బాలిక‌కు కేసీఆర్ త‌న‌య సాయం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంలో ముందుంటారు. కొవిడ్ స‌మ‌యంలో నిజామాబాద్ కేంద్రంలో నిర‌వ‌ధికంగా అన్న‌దానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్‌, మ‌స్క‌ట్ త‌దిత‌ర అర‌బ్ దేశాల్లో చిక్కుకున్న‌వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌జాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ […]

క‌మ‌ల్ ఓట‌మిపై శ్రుతి హాస‌న్ ఎలా స్పందించిందంటే?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగారు. కానీ, క‌మ‌ల్‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా త‌మిళులు ఇవ్వ‌లేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో […]

కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]

బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]

క‌మ‌ల్‌కు ఒక్క సీటూ ఇవ్వని తమిళులు..అదే కార‌ణ‌మా?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించారు. కానీ, క‌మ‌ల్‌కు నిరాశే మిగిలింది. 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ […]

ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ ?

రాజ‌కీయాలు ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఏపార్టీకి ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవ‌కాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయ‌కులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే ధీమాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్ర‌య‌త్నిస్తున్నా ర‌ని […]

బ్రేకింగ్ : తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం..!

నేడు తెలంగాణలో నాగార్జున సాగరు ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వబోతున్నాయి. అందులో టిఆర్ఎస్ పార్టీ విజయము సొంతం చేసుకోవడంతో తెలంగాణ భవన్లో ఆనందోత్సాహం నెలకొన్నది. ఈ ఉత్సాహంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఆనందంతో బాణసంచా కాలుస్తూన్న క్రమంలో నిప్పురవ్వలు భవన్లో ఉన్న చలువ పందిరిపై పడ్డాయి. దీనితో ఒక్క సారిగా చలువ పందిరికి మంటలు అంటుకున్నాయి. ఇలా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాళ్లంతా భయముతో ఉలిక్కి పడ్డారు. అక్కడున్న వాళ్లు కొందరు వెంటనే అప్రమత్తమై మంటలు […]

ముందంజలో దీదీ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బెంగాల్ ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. మొత్తం 292 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 134 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. అందులో టీఎంసీ 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక టీఎంసీతో అమీతుమీ అన్నట్టుగా పోటీ పడుతున్న బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. లెఫ్ట్ పార్టీలు 2, ఇతరులు ఒక్క స్థానంలో […]