మేయ‌ర్ నియామ‌కానికి టీఆర్ ఎస్ ప‌రిశీల‌కులు వీరే..!

ఇటీవ‌ల జ‌రిగిన రెండు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఐదు మున్సిపాల్టీల్లో టీఆర్ ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు పార్టీ త‌ర‌పున పరీశీలకుల పేర్ల‌ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్. ఖమ్మం కార్పోరేష కు పరిశీలకులుగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి. కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకులుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులుగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా రవీందర్ సింగ్ (మాజీమేయర్ కరీంనగర్ ), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్) అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జడ్చర్ల — మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్) వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అయితే పరిశీలకులు గురువారం సాయంత్రంలోగా ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్సర్వర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని కెసిఆర్ ఆదేశించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ,ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పోరేషన్లకు మేయర్లును, డిప్యుటీ మేయర్లును ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు క్రమశిక్షణతో ఎన్నుకోనున్నారు.