టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్రమంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావరేజ్ టాక్ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్లలో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ సినిమాలను థియేటర్లోకి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సమ్మర్ బరిలో చాలా సినిమాలు రిలీజ్కు సిద్దమవుతున్నాయి. ఆ సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం.
హిట్ 3:
నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ డైరెక్షన్లో వస్తున్న మూవీ హిట్ 2. హిట్ సిరీస్ సినిమాలు భారీ సక్సెస్లు అందుకుంటున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరుగునుంది. మే 1న ఈ సినిమా గ్రాండ్ లావెల్లో రిలీజ్ కానుంది.
రెట్రో:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా మూవీ రిట్రో. పూజా హెగ్డే హీరోయిన్గా.. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పింది. ఇది కూడా మే 1న రిలీజ్ కానుంది.
# సింగిల్:
గీత ఆర్ట్స్ బ్యానర్పై శ్రీ విష్ణు హీరోగా.. కార్తీక్ రాజు దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా మే 9న రిలీజ్ చేయనున్నారు.
రైడ్ 2:
2018లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ కొట్టిన రైడ్ కు సీక్వల్గా అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రైడ్ 2. ఇది మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తమ్ముడు:
టాలీవుడ్న్ యంగ్ హీరో నితిన్ హీరోగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది.
శుభం:
టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతా ప్రొడ్యూసర్ గా మారి.. శుభం సినిమాను రూపొందించింది. కొత్త వాళ్లతో నిర్మించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.
లెవెన్:
నవీన్ చంద్ర హీరోగా.. లోకేష్ అజనీష్ దర్శకత్వంలో రూపొందిన ఇండస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్. ఈ సినిమాను మే 16న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
భైరవం:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ భైరవం. విజయ్ కనకమెడల డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. మే 16న ఈ మూవీ రిలీజ్ కానుంది.
త్రికాల:
శ్రద్ధదాస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆమెతో పాటు మాస్టర్ మహేంద్ర, నాజై సాహితీ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీరోహిణి కీలక పాత్రలో మెరవనున్నారు. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23న రిలీజ్ కానుంది.
ఘాటి:
అనుష్క శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మే 30న ఈ సినిమా రిలీజ్ కానుంది.
కింగ్ డమ్:
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో సీతారామ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కింగ్డమ్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
హరిహర వీరమల్లు:
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్గ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని కూడా ఈ ఏడాది సమర్ బరిలో మే నెలలోనే రిలీజ్ చేయనన్నారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు.