స్టార్ నటుడు పరేశ్ రావల్కు టాలీవుడ్ ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్షణక్షణం, రిక్షావాడు, బావ గారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్, తీన్మార్, ఆకాశమే నీ హద్దురా ఇలా ఎన్నో టాలీవుడ్ సినిమాలో నటించి పాపులారిటీ దక్కించుకున్న పరేశ్.. హిందీలోనూ పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక చివరిగా బాలీవుడ్ లో దా స్టోరీ టెల్లర్ సినిమాలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పరేశ్.. ఇటీవల మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈయన కిట్టి, బూత్ బంగ్లా, హీరా ఫెరి 3 సినిమాలతో పాటు.. మరో 7, 8 సినిమాలను లైన్లో ఉంచుకున్నాడు.
కాగా తాజాగా లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో పరేశ్ మాట్లాడుతూ.. తన యూరిన్ తానే తాగి ఓ గాయాన్ని నయం చేసుకున్నాను అంటూ వివరించాడు. ఒకసారి నేను మోకాలు గాయంతో తీవ్రమైన ఇబ్బంది పడ్డానని.. ముంబైలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని.. అప్పుడు నన్ను చూసేందుకు అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగణ్ అక్కడికి వచ్చారని చెప్పుకొచ్చాడు. త్వరలో కోలుకునేందుకు నాకు సలహా ఇచ్చాడని.. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ యూరిన్ మీరే తాగమని చెప్పాడని వివరించాడు.
అలాగే మందు, మాంసం, సిగరెట్లకు దూరంగా ఉండమంటూ వివరించాడని చెప్పుకొచ్చాడు. ఆయన సలహాను నేను పాటించాలనుకున్నా. 15 రోజులపాటు ఆయన చెప్పినట్లుగానే నా యూరిన్ నేను బీర్లా తాగా.. తర్వాత డాక్టర్ ఎక్స్రే తీసి.. రిజల్ట్ కు ఆశ్చర్యపోయారు. ఇంత త్వరగా గాయం ఎలా మాయమైందని షాక్ అయ్యారు. రెండు నెలల తర్వాత డిస్చార్జ్ కావాల్సిన నేను.. వీరు దేవగణ్ సలహాతో నెలన్నరకే క్యూరై హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయా. ఆయన సలహా నాకు ఒక మ్యాజిక్ లా పనిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పరేశ్ చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి.