టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క హీరో నందమూరి కుటుంబ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాస్ హీరోగా సినిమాలు తెరకెక్కించి.. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ ఏంట్రీ పై ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఈ క్రమంలో ప్రస్తుతం బాబి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న బాలయ్య.. మోక్షజ్ఞ ఇంట్రీ గురించి పక్కన పెడితే.. తన సినిమాల గురించి అభిమానులు పండగ చేసుకునే ఒక గుడ్ న్యూస్ ప్రేక్షకులతో షేర్ చేసుకోబోతున్నడట. అదేంటో కాదు బోయపాటి శీను డైరెక్షన్లో ఇప్పటికే బాలయ్య మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో నాలుగో సినిమాకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. వీరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా డ్యూయల్ రోల్లో బాలయ్య కనిపించబోతున్నాడంటూ.. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఓ పాత్రలో బాలయ్య రైతుగా కనిపించనున్నాడట. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో బాలయ్య త్వరలోనే ఈ పోస్టర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది.
ఇక రైతు పాత్ర చేయడానికి బాలయ్య ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారట. ఎట్టకేలకు తన ఆస్థాన డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్లోనే ఆ క్యారెక్టర్ నటించే అవకాశం రావడంతో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడని.. ఈ విషయాన్ని ఆగస్టు నెలలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ పోస్టర్ రిలీజ్ ఈవెంట్లోనే కొంతమంది ఉత్తమ రైతులను సెలెక్ట్ చేసి సన్మానం కూడా చేయబోతున్నాడట. ఇప్పటివరకు బాలయ్య ఎన్నో పాత్రలో నటించాడు. అయితే ఆయన డ్రీం రోల్ మాత్రం రైతు పాత్రనని.. చాలా రోజులుగా ఈ పాత్ర కోసం ఎదురు చూస్తున్నాడని.. ఈ రోజుల్లో రైతు పరిస్థితి ఎలా ఉందో ఈ సినిమా ద్వారా తెలియజేయాలని ప్లాన్ చేస్తాడని.. రైతు కష్టాలను తెలియజేస్తూ ప్రేక్షకులను మెప్పించబోతున్నాడని టాక్.