రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు చక్కడబుతుండడంతో.. మళ్లీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది.
ఈ నేనథ్యంలోనే తాజాగా రాధేశ్యామ్ షూటింగ్పై పూజా న్యూ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ శుక్రువారం మళ్లీ స్టార్ట్ అయిందని తెలిపిన పూజా.. మరో పది రోజుల్లో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి కానుందని పేర్కొంది. ఇక ఇటీవలి కాలంలో తాను చేస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ఇదే అని, అలాగే ప్రభాస్ కూడా చాలా కాలం తర్వాత రొమాంటిక్ మూవీ చేస్తున్నారని.. అందుకే నాకీ సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చంది పూజా.