దేశంలో కొత్త‌గా 39,097 క‌రోనా కేసులు..పెరిగిన మ‌ర‌ణాలు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 39,097 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159 కు చేరుకుంది. అలాగే నిన్న 546 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,20,016 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 35,087 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,05,03,166 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,08,977 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. నిన్నొక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 16,31,266 క‌రోనా టేస్ట్‌లు నిర్వ‌హించారు.