విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబో వచ్చిన తాజా చిత్రం `నారప్ప`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రియమణి, కార్తీకరత్నం, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నారప్పను ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. తెరపై నాకు నారప్ప తప్ప ఎక్కడా వెంకీ కనిపించలేదు. ఆయన ఆ పాత్రను డెప్త్గా అర్థం చేసుకున్న తీరు .. సన్నివేశాలను పండించిన విధానం అద్భుతంగా ఉన్నాయి.
ఈ చిత్రం వెంకటేష్కు మంచి పేరుతో పాటుగా కెరీర్ లో గర్వంగా చెప్పుకొనే చిత్రం అవుతుంది` అని చిరంజీవి ట్వీట్ చేశాడు. ఇక చిరు ట్వీట్ను గమనించిన వెంకీ.. కృతజ్ఞాతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.