కేసీఆర్ కల ఇలా తీరుతుందేమో!

పరిశుభ్రమైన హుస్సేన్ సాగర్ ను హైదరాబాదు వాసులకు అందించాలనేది కేసీఆర్ కల. కానీ.. ఆ సాగర్ ఎప్పటికప్పుడు ఘోరంగా తయారైపోతుండడానికి ఉండే అనేక కారణాలలో వినాయక నిమజ్జనం కూడా ఒకటి. ఏటా వందలకొద్దీ వినాయక విగ్రహాలను ఈ హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేస్తుండడం.. దాని పరిశుభ్రతకు పెద్ద సవాలు. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన, ఇనుప కమ్మీలు వాడి తయారుచేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏ […]

కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!

ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]

గలాట.. గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. ఆయన అవినీతికి హద్దు లేకుండా పోయింది.. రాష్ట్రాన్ని కల్వకుంట కుటుంబం దోచుకుంటోంది.. అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గొంతెత్తుతూ ఉంటాడు. రెండు వారాలుగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అవినీతి గురించే మాట్లాడతాడు. ప్రగతి భవన్ నుంచి జైలుకు పంపుతామని గట్టిగా చెబుతాడు. అయితే బండి సంజయ్ గట్టిగా చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని […]

డబ్బులు పడ్డాయ్ సరే.. డ్రా చేయడం ఎలా?

నాలుగైదు రోజులుగా తమ అకౌంట్లలో దళిత బంధు డబ్బు పడటంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే వారికి నిరాశే ఎదురవుతోంది. డబ్బు తీసుకునేందుకు అవకాశం లేకుండా అకౌంట్ ఫ్రీజ్ లో ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ కు గురికావడం వారి వంతైంది. డబ్బు వచ్చింది కదా అని డ్రా చేసుకునేందుకు లేదని.. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి దానిని వాడుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పథకం ప్రకటించిన ఇన్ని రోజుల […]

కేసీఆర్ అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

తెలుగుదేశం పార్టీలో ఉండి.. అక్కడ ఇమడలేక.. బీజేపీలో చేరి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇపుడు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్న మోత్కుపల్లి నరసింహులు ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేద దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకంపై విమర్శలు రాకున్నా.. రాష్ట్రమంతా అమలు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. దళితులకు […]

కేసీఆర్ ను ఫాలో కావాలంటున్న కుమారస్వామి

కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ […]

హైదరాబాద్ లో కదిలిన ’బండి‘..కమలంలో ఉత్సాహం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసుతన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యకర్తల కోలాహలం మధ్య బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బండి పాదయాత్రకు బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసింది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత చాలా మంది సీనియర్లు ఆయనకు సహకరించడం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో […]

దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]

కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]