ఓటుకు నోటు కేసులో అసలైన ట్విస్ట్..

ఓటుకు నోటు కేసు గుర్తందా.. 2015 నాటి ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని, అసలు ఇది అవనీతి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి […]

దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ మరో అడుగు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు చక్కర్లు కొట్టిన కారు పార్టీ అధినేత ఈసారి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రయాణానికి పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద నాయకులకు విమాన ప్రయాణాలు అరేంజ్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ […]

’కడియం‘ మాటలు వినిపించాయా సారూ..!

దళితబంధును అమలు చేయకపోతే నష్టపోయేది పార్టీనే అని కుండబద్దలు కొట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చెప్పిన మాటలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అరె.. ఆయన ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు అని పలువురు నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న కడియం ఉన్నట్టుండి పొలిటికల్ సీన్ లోకి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్ ఇచ్చారు. జగనాంలో జరిగిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై నిర్మొహమాటంగా తన […]

కెసిఆర్ కేబినెట్ లో ఇద్దరు ‘రెడ్డి’ మంత్రులు అవుట్ ?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగమే దళితబంధు పథకం. అంతేకాక ఆ వర్గాన్ని సంత్రుప్తి పరచడానికి బండ శ్రీనివాసును ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు దళిత నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. వారిలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఇద్దరికి స్థానచలనం తప్పదు. ఆ ఇద్దరూ […]

మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లేనా..!

ఆయన పార్టీలే చేరలేదు.. పార్టీ కండువా కూడా కప్పుకోలేదు.. కనీసం సానుభూతి పరుడు కూడా కాదు.. అప్పుడే పదవి కొట్టేశాడు.. ఆయనే మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన అనంతరం మోత్కుపల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనేది ఆయన వాదన.. పనిలో పనిగా కేసీఆర్‌ ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని అమోఘం అంటూ ప్రశంసించారు. అంటే కారు ఎక్కడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట. ఈనేపథ్యంలో దళిత […]

అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]

గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]

కౌశిక్ ఇంకా ఎమ్మెల్సీ కాలేదు.. రాజ్ భవన్ ఇంకా ఆమోదించలేదు..

కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూరాబాద్ లో పోటీచేస్తానంటూ మాట్లాడి.. ఆ విషయం బయటకు తెలిసిన అనంతరం కారెక్కిన వ్యక్తి. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ అతన్నే ఈటలపై పోటీకి దించుతుందని భావించారు. అయితే అందరూ ఆశ్చర్యపోయే విధంగా సీఎం కేసీఆర్ కౌశిక్ ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించారు. పార్టీలో చేరిన ఆరు రోజులకే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ కేబినెట్ నామినేట్ చేసింది. ఆ తరువాత ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లింది. […]