మంత్రివర్గంలో మార్పులు…ఆ నలుగురు అవుట్?

ఏపీలో మరోసారి మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్..పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టి వారి స్థానాల్లో కీలక నేతలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని తప్పించి..చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]

నెల్లూరు ఎంపీ సీటుపై టీడీపీ పట్టు..వైసీపీ ఛాన్స్ ఇస్తుందా?

తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్ష మాదిరిగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నెల్లూరు పార్లమెంట్ కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి పెద్దగా విజయాలు సాధించలేదు. ఎప్పుడో 1984, 1989, 1999 ఎన్నికల్లో మాత్రమే అక్కడ టి‌డి‌పి గెలిచింది..మళ్ళీ ఆ తర్వాత గెలిచిన సందర్భాలు లేవు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో గెలుపు వరకు వచ్చి బోల్తా కొట్టింది. ఆ ఎన్నికల్లో కేవలం 13 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. […]

ఎలమంచిలి సీటుపై ట్విస్ట్..జనసేన కోసం టీడీపీ!

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున సీట్లలో ఎలమంచిలి కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది..1985 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ 4 వేల ఓట్ల మెజారిటీ తేడాతో గెలిచింది. అయితే జనసేన ఓట్లు చీల్చడం వల్లే అక్కడ టి‌డి‌పికి […]

 టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ మైండ్‌గేమ్!

టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ముమ్మాటికి నష్టమే..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిక ఉండదు..అదే కలిసి లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుని చెడగొట్టేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటికే దమ్ముంటే 175 స్థానాల్లో […]

మేకపాటి దూకుడు..వైసీపీ ప్లాన్ బెడిసికొడుతుందా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని అనుమానిస్తూ..వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికల ముందే ఆనం, కోటంరెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీంతో వారిని వైసీపీ శ్రేణులు పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఎలాగో వారిని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అభ్యర్ధులుగా లెక్కలో […]

ఎమ్మెల్యేలకు బిగ్ ట్విస్ట్..సీట్లు తేల్చడం కష్టమే!

ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సి‌ఎం జగన్ సమీక్షా చేస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుని, వారిని సమావేశపరిచి..వారి పనితీరుపై ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్నారు. ప్రధానంగా గడపగడపకు విషయంలో గట్టి క్లాస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్ళాల్సిందే అని టార్గెట్ పెట్టారు. దీంతో ఎవరైతే గడపగడపకు వెళ్లారో వారికి గట్టి క్లాస్ ఇస్తూ..రాబోయే రోజుల్లో మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ పలుమార్లు గడపగడపపై రివ్యూలు పెట్టారు. […]

ఆనంకు వైసీపీ చెక్..సీటు మారుస్తారా?

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నలుగురు టి‌డి‌పిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి..అది కూడా వచ్చే ఎన్నికల ముందే […]

కేబినెట్ మార్పు..ఏడాదిలో జగన్ రిస్క్ చేస్తారా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది సమయం ఉంది..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటే..సరిగా ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి..ఇలాంటి తరుణంలో జగన్ కేబినెట్ మార్పులు చేయడానికి సాహసిస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. మీడియాలో మాత్రం మంత్రివర్గంలో మార్పులపై కథనాలు వస్తూనే ఉన్నాయి. జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని, వారిని పక్కన పెట్టేసి..వేరే వాళ్ళకు జగన్ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే […]

టీడీపీకి 4..వైసీపీకి 5..జరిగేది ఏది?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయి..అసలు వైసీపీకి ఆ ఐదు సీట్లే వస్తాయి..అని చెప్పి అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు నాలుగు, ఐదు సీట్ల కథ ఏంటో ఒకసారి చూస్తే..గతంలో టి‌డి‌పి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి అదే 23 సీట్లు వచ్చాయి. ఇదే దేవుడు స్క్రిప్ట్ అని వైసీపీ […]