ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ నటనతో మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్లో అనుకోకుండా సడన్గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అదే పార్ట్ 3కి కారణం. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు.. పుష్ప 2కు క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరనే సందేహాలు నెటింట హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండనే ఆ వ్యక్తి అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అదే టైంలో పుష్ప 1, 2 లో కీలక పాత్రలో కనిపించిన ఫహద్ ఫాజిట్ మళ్లీ బతికి రానున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 క్లైమాక్స్లో పుష్పరాజ్, శ్రీవల్లి ఓ పెళ్ళివేడుకలు సందడి చేస్తారు. అందులో అందరూ ఆనందంగా ఉన్న టైంలో.. భారీ బాంబు పేలినట్లుగా వినిపిస్తుంది. కట్ చేస్తే స్క్రీన్ పై రిమోట్ పట్టుకొని.. ఒక్క అన్ రివీల్డ్ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. స్క్రీన్ పై అతని మొఖం కనిపించదు. ఈ క్రమంలోనే ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ అంటూ.. పుష్పని ఎదుర్కొనే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు, అవమానాలు అన్నిటిపై రివేంజ్ తీర్చుకోవడానికి అలాంటి ప్లాన్ చేశాడంటూ తెలుస్తుంది.
అయితే సినిమా చివరకు.. అతను అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు చూపించారు. కానీ.. ఈ ఘటనలో షేకావత్ చనిపోలేదు. పగ తీర్చుకునేందుకు బ్రతికి ఉంటాడని పార్ట్ 3లో మరోసారి షెకావత్.. పుష్పరాజ్తో తలపడనున్నాడని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దీనికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తూ క్లైమాక్స్ లో కనిపించే వ్యక్తి చెయ్యి చాలా సన్నగా ఉంది. అలా.. చేతులపై కాలిన గాయాలు ఉన్నాయి అంటూ షేకావత్ మళ్లీ పుష్పరాజ్ ఫ్యామిలీని చంపేయడానికి ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇక ఇది పుష్ప 3 ర్యాంపేజ్లో తెలియనుంది. ఇక పుష్ప పార్ట్ 3 షూటింగ్ ప్రారంభం కావడానికి రెండేళ్ల టైం పడుతుందని అంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ విలన్ గా కనిపించబోతున్నాడట. అయితే.. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.