ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు మాక్సిమం అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకోవాలని ఆరటపడుతున్నారు. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుకుంటున్నాయి. హీరోస్తో పాటు దర్శక, నిర్మాతలకు కూడా పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అలా మన టాలీవుడ్ హీరోస్ ఇప్పటికే ఎంతోమంది పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్నారు.
అయితే ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నా.. ఇప్పటివరకు ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరో కూడా.. పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్న ఓ రికార్డ్ మాత్రం టచ్ కూడా చేయలేకపోయారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. 24 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్.. ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. ఎస్. జె. సూర్య దర్శకుడుగా వ్యవహరించాడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ను స్టార్ హీరోను చేయడమే కాదు.. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడడానికి కూడా మెయిన్ కారణంగా నిలిచింది. అయితే ప్రెసెంట్ డేస్లో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కినా.. కోట్లు కలెక్షన్లు రాబట్టినా.. ఇప్పటికీ ఖుషి పై ఉన్న రికార్డ్లు మాత్రం టచ్ చేయలేకపోయాయి.
ఆ రికార్డ్ మరేదో కాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో అత్యంత కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్. ఇప్పటికీ.. ఖుషి కి మాత్రమే సొంతంఅయ్యింది. ఇక థియేటర్లో ఈ సినిమా అప్పట్లోనే రూ.1. 56 కోట్ల గ్రాస్ వశూళను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. కాగా ఇప్పటివరకు ఏ పాన్ ఇండియా సినిమా కూడా ఈ థియేటర్లో కనీసం రూ. 1.5 కోట్లను కూడా రాబట్ట లేకపోయింది. ఇక ప్రభాస్, బన్నీ, మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోస్ కూడా ఈ రికార్డును టచ్ చేయలేకపోయారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది మా పవర్ స్టార్ రేంజ్ అంటూ.. ఆయన రికార్డులను టచ్ చేయడం ఎవరివల్ల కాదు అంటూ.. తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.