నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ సిక్వెల్లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్స్టాపబుల్ హోస్ట్గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా ఓటీటీ వేదికపై ప్రసారమయ్యే ఈ సీజన్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు ఎంతమంది సెలబ్రిటీస్ హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే.
బాలయ్య పిలిచారు అంటే టాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్స్ అయినా అషోకు రావడానికి అంగీకరిస్తారు. ఇక బాలయ్య సెలబ్రిటీలను కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలను వేస్తూ.. సమాధానాలు రాబట్టి ప్రజలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సీజన్ 4లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత సీజన్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నుంచి కీరవాణి, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ వరకు చాలామంది సెలబ్రిటీస్ హాజరై సందడి చేశారు. ఇక ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వారు బయట షోలలో పెద్దగా కనిపించకపోయినా.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అనుష్టానబుల్ షోకి వచ్చి ఇంటర్వ్యూలో సందడి చేశారు.
అలాగే బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ కూడా షోలో పాల్గొని సందడి చేశాడు. ఇప్పుడు సీజన్ 4 లో కూడా అదే రేంజ్ లో సెలబ్రిటీ హాజరై సందడి చేయనున్నారని సమాచారం. చిరంజీవి, బాలయ్య మధ్య సినిమాల పరంగా గట్టి పోటీ ఉన్నా.. ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో.. ఈ సీజన్లో చిరంజీవి ఇంటర్వ్యూలో పాల్గొన్నబోతున్నాడని సమాచారం. అంతేకాదు పుష్ప 2 రిలీజ్ కూడా త్వరలోనే ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఈ సీజన్లో వచ్చి సందడి చేస్తాడని సమాచారం. అలాగే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత కూడా సందడి చేయనుందని.. అంతేకాదు శ్రీలీల కూడా ఈ సీజన్లో మెరవనుందని సమాచారం. అంతే కాదు త్వరలోనే హీరోగా మారనున్న మోక్షజ్ఞ కూడా ఈ సీజన్లో సందడి చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అన్స్టాపబుల్ సీజన్ 4 పై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి.