ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్తో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా వాటితో పోటీపడి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమాలో అమృత ఇయర్ హీరోయిన్గా.. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక హనుమాన్ కంటే ముందు తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో జాంబిరెడ్డి, అద్భుతం సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. జాంబి రెడ్డి సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా.. అద్భుతం సినిమాకు మాత్రం స్క్రిప్ట్ అందించాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా అద్భుతం సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయింది.
సైన్స్ ఫిక్షన్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. ఒక కొరియన్ మూవీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కాగా అద్భుతం మూవీ పై ఓ నెటిజన్ తాజాగా షాకింగ్ కామెంట్ చేశాడు. తేజ సజ్జను ట్యాగ్ చేస్తూ.. ఇప్పటికీ ఈ సినిమా నాకు అర్థం కాదు అంటూ కామెంట్ చేశాడు. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తేజసజ్జా రియాక్ట్ అయ్యాడు. అద్భుతం సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలంటూ స్పందించాడు. ఈ క్రమంలో తేజ చేపిన సమాధానం నెటింట తెగ వైరల్గా మారింది.