ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకునిందో మెగా ఇంటి కోడలుగా మారిపోయిందో అప్పటినుంచి లావణ్యను ఒక హీరోయిన్గా కాకుండా ఒక మెగా ఇంటి కోడలుగా ఒక వదినమ్మగా బాగా లైక్ చేస్తున్నారు మెగా అభిమానులు . చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ వదినమ్మ వదినమ్మ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు .
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి నేచర్ లెవెల్ .. పెట్స్ అంటే చాలా ఇష్టం .. డిఫరెంట్ నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది . అలాంటి చోటుకే వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వరుణ్ లావణ్య తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్రకృతి ప్రదేశానికి వెకేషన్ వెళ్లారు. ఆ ఫోటో షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి . ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి .
అక్కడ వెకేషన్ లో దొరికిన రాళ్లు పుల్లలతో స్టవ్ తయారు చేసుకుని మరి టీ పెట్టుకుని తాగుతుంది లావణ్య త్రిపాఠి . ప్రకృతిలో లావణ్య టీ పెడుతున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి సింప్లిసిటీకి మంచితనానికి ఫిదా అయిపోతున్నారు మెగా అభిమానులు . పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఆమె పెళ్లి తర్వాత ఒకే ఒక్క వెబ్ సిరీస్ లో నటించింది . మిస్ పర్ఫెక్ట్ .. ఆ తర్వాత పలు సినిమాలలో ఆఫర్ వస్తున్న సరే లావణ్య త్రిపాఠి ఎందుకో వెనకడుగు వేస్తుంది . దానికి కారణం మెగా ఫ్యామిలీ నా..? లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నదాని కోణంలో ఆలోచిస్తున్నారు అభిమానులు..!!
View this post on Instagram