టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుని టాప్ హీరోయిన్ లిస్టులో రాజ్యమేలేస్తున్న హీరోయిన్ సమంత ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో ఉందో మనకు బాగా తెలిసిందే. క్రేజ్ పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ పొజిషన్లో ఉండే సమంత హిట్ కి మాత్రం ఆమడ దూరంలో ఉంది . సమంత హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత ఖాతాలో హిట్ అనేది లేదు .
భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . ఇలాంటి క్రమంలోనే సమంత ఖాతాలో ఒక హిట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు. కాగా ఖుషి సినిమాతో ఎలాగైనా సరే సమంత హిట్ కొట్టాలని ..చాలా కసిగా ఉంది . ఆ తర్వాత వెంటనే సిటాడిల్ వెబ్ సిరీస్ లో సమంత క్రేజీ హిట్టు తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంది. కాగా సమంతకి మళ్ళీ మయోసైటిస్ అనే వ్యాధి తిరగబడింది అన్న ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది .
అంతేకాదు త్వరలోనే ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి సినిమాలకు బ్రేక్ చెప్పి మరి సమంత అమెరికా వెళ్ళబోతుంది . ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండగా సమంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు . రీసెంట్ గా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు సమంత . ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు . కీలకమైన చికిత్స కు ముందు సమంత ఇలా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .