టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈమె మీనా అనే చిత్రంతో దర్శకురాలిగా పరిచయమై మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
ఇకపోతే ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే.. విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించడానికి ఆమె కొడుకు నరేష్ కథ సిద్ధం చేశారు అని, ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో విజయనిర్మల బయోపిక్ లో ఆమె పాత్రలో నటించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నరేష్, సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అయితే బాగుంటుందని భావిస్తున్నారట . ఇకపోతే గతంలో కూడా కీర్తి సురేష్ విజయనిర్మల బయోపిక్ లో నటిస్తుందని వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు మళ్లీ సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మరణించడంతో ఈ వార్త మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా బయోపిక్ తీయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.