అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి.

మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్‌ చేశాడు బాలయ్య… ఎప్పటిలాగానే బాలయ్య తన మేనరిజం తో తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు, బావ- అల్లుడుతో కలిసి బాలయ్య చేసిన రచ్చ అంత ఇంతా కాదు. తొలి ఎపిసోడ్ సెన్సేషనల్ హిట్ కావడంతో… అందరి చూపు రెండో ఎపిసోడ్ మీద పడింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్ కు బాలయ్య‌ ఎవరని తీసుకొస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆహా యజమాన్యం తన అధికార ట్విట్టర్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

‘గెస్ ది గెస్ట్ ఆఫ్ ఎపిసోడ్-2’ అంటూ రెండు ఎపిసోడ్ కు వచ్చే గెస్ట్ లు ఎవరో గెస్ చేయాలంటూ రెండు పజిల్స్ ను షేర్ చేసింది.. ఆహా టీం.. మొదటి పజిల్‌ను చూస్తే డీజెట్టిల్లు హీరోయిన్ నేహా శెట్టి… టాక్ షో కి వస్తుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అభిమానులు కూడా అదే కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో పజిల్ కొంత కఠినంగా ఉంది. యువ హీరో భిన్నమైన సినిమాలు తీసుకుంటూ తనుకుంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్ అని కొందరు అంటున్నారు.. రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమస్ అయిన సిద్దు జొన్నలగడ్డని మరికొందరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ పజిల్స్ పై ఓ లుక్కెయ్యండి… అన్ స్టాపబుల్ రెండవ షోకి గెస్టులెవరో మీరు కనిపెట్టండి.