నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్2 తాజా ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్సేన్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇదే ఎపిసోడ్లో భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగ వంశీ కూడా వచ్చారు. ‘ఆ సందర్భంలోనే భీమ్లా నాయక్ సినిమాలో మొదట మీరు హీరోగా చేయాల్సింది అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు’.
అప్పుడు బాలకృష్ణ మీరు నన్ను ఎందుకు హీరోగా తీసుకోలేదంటూ అతన్నే ప్రశ్నించాడు.. వంశీ మాట్లాడుతూ “మీరే కదా సార్ ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తేనే బాగుంటుందని అన్నారు. మీరు చెప్పారని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని సంప్రదించామని నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చాడు”.
భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ హీరో అని ఈ సినిమా చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి.
కానీ చివరకు పవన్ కళ్యాణ్ హీరోగా ఆ సినిమా తెరకెక్కటానికి బాలకృష్ణనే కారణం.. బాలకృష్ణ ముందుగా ఆ సినిమా స్క్రిప్ట్ చూసి నాకన్నా పవన్ కళ్యాణ్ కి బాగా సూట్ అవుతుంది.. ఆయనే ఈ సినిమాకు నయం చేస్తాడని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కు చెప్పడం వలన మేము పవన్ కళ్యాణ్ తో సినిమా తీశామని నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ కం బ్యాక్ హిట్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం బాలకృష్ణ.