సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్లకు ఊతమిచ్చేలా సమంత కూడా ఎమోషనల్ పోస్టులు పెడుతోంది. మరోవైపు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధానికి భీటలు వారాయని ప్రచారం జరుగుతుంది.
ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోబోతున్నారనే వార్త ఎవరికీ మింగుడు పడటం లేదు. అయితే ఇప్పుడు సామ్-చై విడాకుల వ్యవహారంలోకి ప్రముఖ నటి శ్రీరెడ్డి దూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. రెడ్డి మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా నిలిచిన చై-సామ్లపై తప్పుడు వార్తలను క్రియేట్ చేయవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది.
వారి బ్రేకప్ గురించి పుకార్లు చేయవద్దు అని తెలిపింది. అంతే కాకుండా సమంత, చైతన్యల జంటను స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అంటూ ప్రశంసలు కురిపించింది. దాంతో శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.