సీనియర్లతో పోటీకి సై అంటున్న నాగ చైతన్య.. !

అక్కినేని నటవారసుడు నాగచైతన్య లేటెస్ట్ మూవీ చందుమండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ తండేల్ సినిమాలో నాగచైతన్య ఫిషర్ మ్యాన్‌గా కనిపించనున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుందని.. ఈ క్రమంలోనే సినిమాను డిసెంబర్ ఎండింగ్లో అంటే క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని మొదట్లో మేకర్స్ ప్లాన్ చేశారు.

కానీ.. డిసెంబర్ రేస్‌లో పుష్ప2, గేమ్ ఛేంజ‌ర్‌.. రెండు పాన్ ఇండియా సినిమాలు బరిలో ఉండడంతో సినిమాను వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నారట. అయితే మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా.. క్రిస్మస్ కుదరకపోతే తర్వాత సంక్రాంతికి తండేల్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇప్పటికే సినిమా విషయంలో మూవీ టీం చాలా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొంగల్ రేసులో దిగేందుకు కూడా సిద్ధమంటూ వాళ్ళు వెల్లడిస్తున్నారు.

కాగా సంక్రాంతికి ఇప్పటికే చిరంజీవి విశ్వంభర ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అలాగే బాలయ్య 109, వెంకటేష్ 76వ సినిమాలు కూడా పొంగల్ బర్రిలో దిగనున్నాయని సమాచారం. ఈ మూడు సినిమాలతో తండేల్‌ కూడా తీసుకువచ్చే ప్లానింగ్‌లో మేకర్స్ ఉన్నారట. ఈ క్రమంలోనే సీనియర్ టాప్ స్టార్స్‌తో నాగచైతన్య.. బరిలో పోటీకి సై అంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలైతే ఈ సంక్రాంతికి నాగార్జున సినిమా వస్తే సీనియర్ స్టార్స్ నలుగురిలో గట్టిపోటీ ఉండేది. కానీ ఆ ప్లేస్‌లో ఈసారి నట వారసుడిగా నాగచైతన్య బరిలో దిగులున్నాడని టాక్‌ నడుస్తుంది. మరి ఈ తండేల్‌ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.