ఆంధ్రప్రదేశ్లో వచ్చే జూన్ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ గెలుచుకున్నవే. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వైసీపీ నేతల్లో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకోనుంది. ఈ నాలుగు సీట్లు ఎవరెవరు పంచుకోవాలనే దానిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ మధ్య ఓ డీల్ కుదిరిపోయింది.. ఈ డీల్ ఎలా ఉండబోతోంది.. ఏయే పార్టీల తరపున ఎవరెవరు ? రాజ్యసభ ఎంపీలుగా ఎన్నిక కాబోతున్నారో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి.

