సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగు పెట్టారంటే.. అన్ని తరహా పాత్రలోనూ నటించాల్సి ఉంటుంది. ఓకే వయసులో ఉన్న వారైనా సరే పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు హీరోలకు హీరోయిన్లు తల్లి పాత్రలను.. నటించాల్సి ఉంటుంది. అంతే కాదు కోడలిగా, చెల్లిగా నటించినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా గతంలో శ్రీదేవి.. ఎన్టీఆర్, కృష్ణ , శోభన్ బాబు, నాగేశ్వరరావు తో ఇతర పాత్రలో నటించి తర్వాత వీరితోనే హీరోయిన్ గాను నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా.. శ్రీదేవి మాత్రమే కాదు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం జనరేషన్లో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. అందులో ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం.
రీసెంట్ గా ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఓ హీరోయిన్.. గతంలో నాచురల్ స్టార్ నాని కోడలిగా నటించిందని.. అదే హీరోయిన్ విజయ్ దేవరకొండ జంటగా మెరిసిందని టాక్ నెటింట వైరల్గా మారుతుంది. ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య రాజేష్. గతంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్లో నానికి కోడలుగా ఆమె మెరిసింది. ఇక ఈ సినిమా టైంలో కరోనా విలయతాండవం ఆడుతున్న క్రమంలో.. థియేటర్స్ పెద్దగా లేకపోవడంతో.. సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. థియేటర్లో విడుదలై ఉంటే సినిమాకు మరిన్ని కలెక్షన్లు వచ్చేవని.. ఇంకా బాగుండేది అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. కాగా ఐశ్వర్య రాజేష్ విజయ్ దేవరకొండ హీరోగాను మెరిసిన సంగతి తెలిసింది.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ భార్యగా నటించిన ఈ అమ్మడు తన నటనకు ఈ రెండు సినిమాలతోనూ మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయింది. కాగా తాజాగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బా..బా.. అంటూ భాగ్యం రోల్ లో ఆడియన్స్ను మెప్పించిన సంగతి తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తోనూ కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఐశ్వర్య లక్ మారిపోతుందని.. వరుస సినిమాలతో బిజీగా గడుతుందని అంతా భావించారు. కానీ ఊహించిన రేంజ్ లో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. నటన పరంగా అన్ని సినిమాల్లోనూ తన సత్తా చాటుకున్న.. తెలుగులో అమ్మడు పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. తమిళ్లో మాత్రం హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తూ.. పలు వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బుల్లితెర ఆడియన్స్కు సైతం దగ్గరవుతుంది.