ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు.. కమర్షియల్ గా కూడా అన్ని హంగులు ఉండే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ మూవీ ఓ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.
శంకర్ గారు కథగా రాసుకున్నారు. నాకు ఆయన దగ్గర గేమ్ చేంజర్ స్టోరీ ఉందని తెలిసింది. ఆయన ఓ 45 నిమిషాల కథను వెల్లడించాడు. చాలా అద్భుతంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గేమ్ ఛేంజర్ కథను మొదట శంకర్ మరో టాలీవుడ్ స్టార్ హీరో కోసం రాశాడట. ఆ హీరో ఎవరో కాదు పవన్ కళ్యాణ్. శంకర్ మొదట ఈ కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారని.. పవన్ తోనే తీయాలని భావించారని.. కానీ నేను రాంచరణ్ తీస్తే బాగుంటుందని చెప్పా ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు అంటూ వివరించాడు.
త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉన్న చరణ్ వెంటనే వెళ్లి కలిశాం. కథ నచ్చడంతో చరణ్ ఓకే చెప్పాడు. అలా మూవీ సెట్స్ పైకి వచ్చిందంటూ దిల్ రాజు వెల్లడించాడు. ఇక చరణ్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పవన్ కోసం అనుకున్న కథను చరణ్తో తీశారా అంటూ.. ఒకవేళ పవన్ ఈ సినిమాలో నటించి ఉంటే సినిమాపై మొదటి నుంచి మరింత హైప్ పెరిగేది అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.