ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈమె ఈ సినిమాలో నటించడానికి ఏకంగా రూ .5కోట్లు పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన నటనతో అందాలతో యువతను ఆకట్టుకోబోతోంది. ముఖ్యంగా రూ .1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాలని యంగ్ టైగర్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సినిమా ప్రమోషన్స్ ఆశించినంత స్థాయిలో జరగడం లేదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
మరొకవైపు సెప్టెంబర్ 7న మూవీ ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవర సినిమా నుంచి మరో రెండు పాటలు కూడా విడుదల కావాల్సి ఉండగా.. ఎప్పుడు విడుదలవుతాయని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు కూడా ఇంకా వినిపించలేదు. దేవరా సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం వేరే లెవెల్ లో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవర సినిమా బడ్జెట్ పరంగా భారీగా పెట్టేశారు. దాదాపు 300 కోట్ల రూపాయలు కు మించి అవుతున్నట్లు తెలుస్తోంది . అనిరుద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా, కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
దేవర సినిమా హిట్ బొమ్మ అని అయితే అందరూ అంటున్నారు కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా రీచ్ కావాలంటే సినిమాకు మరింత ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 27వ తేదీన రికార్డు స్థాయి స్క్రీన్ లలో సినిమా విడుదల కానుంది. మరి రూ.1000 కోట్లు రాబట్టాలి అంటే ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేయాల్సి ఉంటుంది గురు అంటూ కొరటాల శివకు సలహాలు ఇస్తున్నారు అభిమానులు.