గ్లోబల్స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీయారా అద్వానీ జరగండి జరగండి పాట షూట్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఇటీవల కేన్స్ 77వ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ కి పది రోజులు సమయం పట్టిందని వెల్లడించింది.
ఏకంగా రోజుకు 3 నుంచి 4 గంటలు రిహార్సెల్స్కే సమయం అయ్యేదని వివరించింది. చరణ్తో స్టెప్స్ మ్యాచ్ చేయడానికి ఇద్దరం కష్టపడాల్సి వచ్చిందని.. ఈ సినిమాకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారంటూ వివరించింది. షూటింగ్ తర్వాత కూడా గంటలు గంటలు రిహార్సెల్స్ చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ టైం నేను ఎంజాయ్ చేశానని.. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని చూశానని వివరించింది. శంకర్ తో పని చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉండేది.. ప్యాషన్ తో పాటు.. పెద్ద విజన్.. ముందు సినిమా కంటే ఈ సినిమా ఇంకా బాగా రావాలి అని అహర్నిశలు కష్టపడే వ్యక్తి శంకర్.
నాకు ఆయనలో అది చాలా నచ్చుతుంది అంటూ కీయారా చెప్పుకొచ్చింది. ఇక జరగండి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆమెకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని.. తన మాసి స్టెప్స్ చూసి కాల్ చేసి మరి చాలామంది ప్రశంసించారు అంటూ వివరించింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకులం ముందుకు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో కెన్స్ ఫెస్టివల్ లో జరగండి జరగండి ఎక్స్పిరియన్స్ గురించి కియారా చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి.