సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇక గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఆ సమయంలోనే మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవగా జస్ట్ స్పీడ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేసి మహేష్ పుట్టినరోజు కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడూ ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫ్యామిలీ సినిమాలుగా తెరకెక్కుతాయి.. అయితే ఇప్పుడు మహేష్తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో ఫ్యామిలీ అంశాలతో పాటు యాక్షన్కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.
మరీ ఈ సినిమాలో గుంటూరు జిల్లాలోని పల్నాడు రాజకీయాలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని.. ఇక పల్నాడులో జరిగిన గొడవలు కూడా ఈ సినిమాలో టచ్ చేయనున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్. ఈ సినిమాను దాదాపూ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులు కూడా అమ్ముడుపోయాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్- త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్కు జంటగా పూజా హెగ్డే- శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మరి ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.