మహేష్ కోసం ఎవరూ టచ్ చెయ్యని పాయింటును తీసుకోబోతున్న త్రివిక్రమ్.. మరో హిట్ కన్ఫామ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇక గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఆ సమయంలోనే మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

Mahesh Babu to begin shooting for SSMB 28 on January 18, release date, cast  & OTT platform announced

రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవగా జస్ట్ స్పీడ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేసి మహేష్ పుట్టినరోజు కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడూ ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫ్యామిలీ సినిమాలుగా తెరకెక్కుతాయి.. అయితే ఇప్పుడు మహేష్‌తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో ఫ్యామిలీ అంశాలతో పాటు యాక్షన్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.

Mahesh Babu: మహేష్ బాబు ఫోన్, త్రివిక్రమ్ షాక్ ఇంతకీ విషయం ఏంటి అంటే |  Mahesh to resume Trivikram film shoot from December 8

మరీ ఈ సినిమాలో గుంటూరు జిల్లాలోని పల్నాడు రాజకీయాలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని.. ఇక పల్నాడులో జరిగిన గొడవలు కూడా ఈ సినిమాలో టచ్ చేయనున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్. ఈ సినిమాను దాదాపూ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులు కూడా అమ్ముడుపోయాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్- త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజా హెగ్డే- శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మరి ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.